Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని.. నిండు గర్భవతిని..?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (12:38 IST)
నిండు గర్భవతి అని కనికరం లేకుండా తల్లిదండ్రులు ఆమెను మట్టుబెట్టారు. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని తల్లిదండ్రులు ఆమెను కర్కశంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే.. యూపీ, ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ 19ఏళ్ల యువతి రాహుల్ అనే యువకుడిని ప్రేమించింది. 
 
ప్రియుడి కోసం 2022 అక్టోబర్‌లో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిపై కిడ్నాప్, రేప్ కేసులు పెట్టింది. దీంతో ప్రియుడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసు విచారణ కోర్టులో జరుగుతూ వుంది. అయితే తల్లిదండ్రుల వద్దకు రావడానికి ముందు కూతురు గర్భం దాల్చింది. 
 
అయినప్పటికీ రాహుల్‌కు శిక్ష పడాలని యువతి తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీనికోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తమ కూతురుని పలుమార్లు బలవంతం చేశారు. దీని కోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నిరాకరించింది. దీంతో ఆవేశంతో ఆ తల్లిదండ్రులు కూతురి గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గర్భిణీ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం