Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.. కొడుకును అమ్మేశారు..

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (11:38 IST)
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న మనస్పర్ధలు... ఓ బాలుడి జీవితం అయోమయంలో పడింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మథిలి మండలం కియాంగ్ పంచాయతీ పరిధిలోని తేలగ బేజా గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
తొమ్మిదేళ్ల బాలుడు వాసుదేవ్‌ను కొనుక్కున్న అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం అతడిని పశువుల కాపలాకు పంపించేది. వెళ్లనని మారాం చేస్తే ఇష్టం వచ్చినట్టు కొడుతుండే వారు. అంతేకాదు, భోజనం కూడా సరిగా పెట్టేవారు కాదు. వారి చిత్రహింసలు రోజు రోజుకు మరింత పెరగడంతో భరించలేకపోయిన బాలుడు అక్కడి నుంచి తప్పించుకుని సలపదర్ అనే గ్రామానికి చేరుకున్నాడు.
 
వాసుదేవ్ కథ విన్న గ్రామస్తులు అతడిని తీసుకెళ్లి అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించారు. బాలుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త జయంతి వాసుదేవ్‌ను తన ఇంటికి తీసుకెళ్లింది. అయితే, విషయం తెలిసిన బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబం అతడిని విడిచిపెట్టాలంటూ జయంతికి ఫోన్ చేసి బెదిరించింది. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 
 
స్పందించిన అధికారులు బాలుడి ఇష్ట ప్రకారమే ముందుకు వెళ్తామని, అతడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తామంటే పంపిస్తామని, లేదంటే చదువుకుంటానంటే చదివిస్తామని తెలిపారు. కాగా, బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నదీ తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments