Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో 10 మంది ఐఎస్ఐ ఉద్యోగులు: పాక్‌కు వెళ్తూ బాంబు పేల్చిన అఖ్తర్

ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో 10 మంది ఐఎస్ఐకి చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారని దేశ బహిష్కరణకు గురైన దౌత్యాధికారి మహమూద్ అఖ్తర్ తన కుటుంబ సభ్యులతో స్వదేశానికి వెళ్తూవెళ్తూ బాంబు పేల్చాడు.

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (09:35 IST)
ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో 10 మంది ఐఎస్ఐకి చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారని దేశ బహిష్కరణకు గురైన దౌత్యాధికారి మహమూద్ అఖ్తర్ తన కుటుంబ సభ్యులతో స్వదేశానికి వెళ్తూవెళ్తూ బాంబు పేల్చాడు. దౌత్యపరమైన రక్షణ ఉంటుందన్న ఏకైక కారణంతోనే వీరాంతా ఇక్కడ పని చేస్తున్నారని తెలిపారు. 
 
సైన్యానికి చెందిన రహస్య పత్రాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై అఖ్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అతని వద్ద జరిపిన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తరపున 10 మంది ఢిల్లీలో వివిధ స్థాయుల్లో పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం. 
 
కాగా, పాకిస్థాన్ దేశ బహిష్కరణకు గురైన భారత దౌత్యాధికారి సూర్జీత్ సింగ్‌ త‌మ‌ దేశంలో ఉండడానికి వీలులేని వ్యక్తిగా పాక్‌ ప్రకటించింది. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పాక్ విడిచారు. ఈ విష‌యాన్ని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ నెల 27న ఆయ‌న‌ను 48 గంటల్లోగా పాకిస్థాన్‌ విడిచిపెట్టాల్సిందిగా ఆదేశించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments