Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్ జైల్లో పాకిస్థాన్ ఖైదీని చంపేశారు...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:50 IST)
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో ఒక్క దేశ ప్రజలు మాత్రమే కాదు.. దేశంలోని వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. దీనికి నిదర్శనమే ఈ దారుణ ఘటన. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌ జైల్లో ఉన్న పాకిస్థాన్ దేశానికి చెందిన ఖైదీని భారతీయ ఖైదీలు కొట్టి చంపేశారు. 
 
ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు గూఢచర్యం ఆరోపణలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మృతుడిని షకీర్‌గా గుర్తించారు. ఇదే జైల్లో శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు అతడిపై దాడిచేసి కొట్టిచంపేశారు. దీనిపై సమాచారం అందగానే సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు జైలుకు చేరుకుని విచారణ చేపట్టారు.
 
దీనిపై జైళ్ళ శాఖ ఐజీ రూపేందర్ సింగ్ స్పందిస్తూ, "‘ఓ పాకిస్థాన్ ఖైదీ జైపూర్ కేంద్ర కారాగారంలో హత్యకు గురైనట్టు సమాచారం అందింది.. దానిపై వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నాం" అని వెల్లడించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో ఆగ్రహంతో ఉన్న భారతీయ ఖైదీలు ఈ దారుణానికి ఒడిగట్టారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments