Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. నాలుగో రోజు ఎన్‌కౌంటర్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (17:27 IST)
జమ్మూకాశ్మీర్‌లోని భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య వరుసగా నాలుగో రోజు ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కోకెరంగ్‌లోని గడుల్ అటవీ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, స్థానిక పోలీసులు మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఆ రోజు రాత్రి ఉగ్రవాదులతో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ రోజులు గుడుస్తున్నా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ సైనికుడు గల్లంతవగా, ముగ్గురు అధికారులు అమరులయ్యారు. 
 
కొండపైన గుహలో ఉన్న ఉగ్రవాదులు కిందనున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. కొండను చుట్టుముట్టిన భద్రతా బలగాలు రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తున్నాయి. 
 
వాతావరణంతో పాటు అక్కడి పరిస్థితులు సైన్యానికి సవాలుగా మారడంతో ఉగ్రవాదులపై పట్టు సాధించడం కష్టంగా మారుతోంది. పూర్తిస్థాయి శిక్షణ పొందిన ఉగ్రవాదులు కావాల్సిన ఆహారం, పేలుడు సామగ్రితో పక్కా ప్రణాళిక ప్రకారం అందులో తలదాచుకున్నారు. గుహలో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండొచ్చని సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments