Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జీయా కేసుతో లింక్.. చిదంబరం ఇంటిపై సీబీఐ రైడ్

షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

Webdunia
మంగళవారం, 16 మే 2017 (11:41 IST)
షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై కేంద్ర మాజీ ఆర్థిక, హోం మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇంటితో పాటు 14 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.

కార్తీ చిదంబరం సంస్థ 2008లో లంచాలు తీసుకుని ఐఎన్ఎక్స్ మీడియాకు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించినట్లు సీబీఐ వర్గాలు గుర్తించాయి. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఎక్చేంజ్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) నుంచి రూ.4కోట్ల నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. 
 
అయితే ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇప్పించేందుకు కార్తీ చిదంబరం సంస్థ రూ.10 లక్షలు లంచం తీసుకుందని.. ఆపై ఐఎన్ఎక్స్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రూ.305కోట్లను సమీకరించిందని సీబీఐ వర్గాల సమాచారం. ఈ ఒప్పందాలు కుదిరిన సమయంలో మాజీ ప్రధాన మంత్రి  మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారని.. ఈ స్కామ్‌లో పీసీ పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని సీబీఐ వర్గాల సమాచారం.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments