Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి ఉత్సవాల్లో గోమూత్రం తలపై చల్లుకుని ముక్తిపొందండి!

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (11:08 IST)
భారతీయ జనతా పార్టీ అనుబంధ పార్టీగా ఉన్న హిందూ సంఘటన్ యువ మోర్చా నేతలు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. దసరా శవన్నవరాత్రుల్లో ముస్లింలను అనుమతించవద్దని హిందూ సంఘటన్ యువ మోర్చా అధ్యక్షుడు రఘువీర్ సింగ్ జడేజా పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఈ ఉత్సవాల్లో పాల్గొనే హిందువులు తమ శరీరంపై, తలపై గోమూత్రాన్ని చిలకరించుకోవాలని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... దసరాలో భాగంగా వైభవంగా జరిగే 'గార్బా' కార్యక్రమాల్లో ముస్లింలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. విశ్వహిందూ పరిషత్ తో సన్నిహిత సంబంధాలున్న ఈ కాషాయ కమిటీ, గార్బా ఈవెంట్లలో పాల్గొనే వారు తప్పనిసరిగా తిలకం ధరించాలని, తమ కార్యకర్తలు అన్ని చోట్లా జరిగే నవరాత్రి ఉత్సవాలపై నిఘాను పెట్టారని జడేజా తెలిపారు. 
 
అయితే జడేజా నేతల వ్యాఖ్యలపై బీజేపీ నేతలే మండిపడుతున్నారు. చాలా మంది హిందువులు రంజాన్ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఎందరో ముస్లింలు పాల్గొంటారు. ఇప్పుడీ మతాల ప్రాతిపదిక ఏంటి? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments