Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలంతా జంతువులే.. ఆ ఇద్దరు మాత్రం జంతువేతరులు: రాహుల్

విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ బీజేపీ జాతీయాధ్యక్షుడు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత దేశంలో ఉన్న ప్రజలంతా జంతువ

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (14:04 IST)
విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ బీజేపీ జాతీయాధ్యక్షుడు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత దేశంలో ఉన్న ప్రజలంతా జంతువులేనని.. కేవలం రెండే రెండు జంతువేతరులున్నారని.. వారెవరో తెలుసా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలని ఎద్దేవా చేశారు. 
 
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌ పరిసరాల్లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ.. ఓ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలను దెప్పిపొడిచారు. తదుపరి ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఉండదని అర్థం చేసుకున్న మోదీ, మానసికంగా కుంగిపోయారని, అందుకే ఇలాంటి అగౌరవ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 
 
దేశంలోని దళితులు, మైనారిటీలు సహా తమ పార్టీ నేతలను కూడా వారు పనికిరాని వారుగా చూస్తున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు. ఆర్థికంగా దేశాన్ని సర్వనాశనం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, బ్యాంకుల కుంభకోణాలు పెరిగిపోయానని, నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments