Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నుంచి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్

Webdunia
గురువారం, 14 మే 2020 (18:35 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై మొదటి రోజు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం గురించి మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామీణ ఆర్థికం, వలస కూలీల సమస్యలు, రైతులు సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నాటికి దీనిని దేశ వ్యాప్తంగా అమలులోకి తేనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ప్రకారం రేషన్ కార్డ్ ఉన్నవారు దేశంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. దీన్ని పోర్టబిలిటీ విధానం అంటారు. 
 
తెలుగు రాష్ట్రాల మధ్య ఈ విధానం ప్రస్తుతం అమలులో ఉంది. ఇకపై ఇది దేశవ్యాప్తంగా అమలు కానుంది. దీని వల్ల 23 రాష్ట్రాలలోని 67 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ప్రజా పంపిణీలో భాగమైన 83 శాతం మందికి ప్రయోజనం ఉంటుందని కూడా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments