Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక వ్యక్తి.. ఒకే పోస్టు : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్య

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (19:39 IST)
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే జరుగనుంది. ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదలకాగా, అక్టోబరు 17వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిర్ణయానికి కట్టుబడివుండాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
కేరళలో కొనసాగుతోన్న భారత్‌ జోడో యాత్రలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీలో ఒకవ్యక్తి-ఒకే పదవిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి అనేది కేవలం ఓ సంస్థకు సంబంధించిన స్థానం కాదు. అదొక సిద్ధాంతపరమైన స్థాయి, విశ్వసనీయ వ్యవస్థ. పార్టీలో పదవులపై ఉదయ్‌పుర్‌లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు. 
 
సీఎం పదవితోపాటు ఎన్నికల్లో గెలిస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపడతానంటూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ చెబుతోన్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ విధంగా స్పందించారు. పార్టీ బాధ్యతలు ఎవరు చేపట్టినా సరే.. అభిప్రాయాల సమూహం, విశ్వసనీయ వ్యవస్థ, దేశపు దార్శనికతను ఆ పదవి తెలియజేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments