Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక వ్యక్తి.. ఒకే పోస్టు : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్య

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (19:39 IST)
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే జరుగనుంది. ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదలకాగా, అక్టోబరు 17వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిర్ణయానికి కట్టుబడివుండాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
కేరళలో కొనసాగుతోన్న భారత్‌ జోడో యాత్రలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీలో ఒకవ్యక్తి-ఒకే పదవిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి అనేది కేవలం ఓ సంస్థకు సంబంధించిన స్థానం కాదు. అదొక సిద్ధాంతపరమైన స్థాయి, విశ్వసనీయ వ్యవస్థ. పార్టీలో పదవులపై ఉదయ్‌పుర్‌లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు. 
 
సీఎం పదవితోపాటు ఎన్నికల్లో గెలిస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపడతానంటూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ చెబుతోన్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ విధంగా స్పందించారు. పార్టీ బాధ్యతలు ఎవరు చేపట్టినా సరే.. అభిప్రాయాల సమూహం, విశ్వసనీయ వ్యవస్థ, దేశపు దార్శనికతను ఆ పదవి తెలియజేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments