Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంద్రాలో భవనం కూలింది.. 11మంది మృతి.. అదెలా కూలింది..?

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (14:43 IST)
Mumbai
ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఖేర్వాడి రోడ్‌లోని ఓ భవనం అర్ధరాత్రి కుప్పకూలింది. దీంతో 11మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయని బీఎంసీ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని రక్షించినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
 
కాగా.. సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే జీషన్‌ సిద్ధిఖి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో బిల్డింగ్‌ కూలిపోయిందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది బాధితులను కాపాడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. 
 
ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డింగ్ ఏలా కూలిందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. దీంతోపాటు టౌన్ ప్లానింగ్, ఇంజనీర్ అధికారులు కూడా పరీశీలిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments