Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత అంటే 2873 మంది ఓటర్లకు ఇష్టంలేదట... నోటాకు 5.58 లక్షల ఓట్లు!

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (13:03 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అంటే 2873 మంది ఓటర్లకు ఏమాత్రం ఇష్టం లేదట. ఈ విషయం నోటా ఓట్ల ద్వారా తేటతెల్లమైంది. చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం నుంచి జయలలిత పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జయలలితకు 97218 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో డీఎంకే అభ్యర్థి సిమ్లా ముత్తుచోళన్‌కు 53818 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో బీజేపీ, డీఎండీకే, పీఎంకే అభ్యర్థులు నిలువగా, నోటాకు 2873 ఓట్లు పోలయ్యాయి. అంటే ఈ నియోజకవర్గం పరిధిలో ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లలో 2873 మంది ఓటర్లు జయలలిత అంటే కూడా ఇష్టం లేదని తమ ఓటు ద్వారా నిరూపించారు. 
 
ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నోటా బటన్‌కు ఏకంగా 5.58 లక్షల ఓట్లు పోలయ్యాయి. భారత ఎన్నికల సంఘంట వెల్లడించిన వివరాల మేరకు తమిళ ఓటర్లలో ప్రతి 100 ఓటర్లలో ఒకరు నోటాకు ఓటు వేశారు. అలాగే, చెన్నైలో ప్రతి 50 మందికి ఒకరు నోటా బటన్‌ను నొక్కారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 5.58 లక్షల ఓట్లు పోలు కాగా, ఇందులో చెన్నైలోనే అత్యధిక సంఖ్యలో నోటాకు ఓట్లు పోలైనట్టు తెలిపింది. 
 
చెన్నై నగరంలోని వేళచ్చేరి అసెంబ్లీ నియోజకవర్గంలో గరిష్టంగా 4255 మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ఆతర్వాత అన్నానగర్ సెగ్మెంట్‌లో 4048 ఓట్లు, విరుగంబాక్కంలో 3897, హార్బర్ స్థానంలో 2101 ఓట్లు చొప్పు నోటాకు పోలయ్యాయి.  అలాగే, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పోటీ చేసిన కొళత్తూరులో కూడా 3554 మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. 
 
చెన్నై నగర శివారు అసెంబ్లీ స్థానాలైన షోళింగనల్లూరు స్థానంలో 7332 మంది, మదురవాయల్‌లో 6655 మంది, పల్లావరంలో 5823, అంబత్తూరులో 5603, తాంబరంలో 5007 మంది చొప్పున ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ముఖ్యంగా అంబత్తూరు నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో 2.5 శాతం మంది ఓటర్లు నోటాకు ఓటు వేయడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments