Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరోసారి పెరిగిన కరోనా మృతుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:27 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393 కేసులు, 911 మరణాలు వెలుగు చూశాయి. క్రితంరోజుతో పోల్చితే కేసుల్లో 5.4 శాతం తగ్గుదల కనిపించింది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. అంతకు ముందు రోజు 817 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
 
తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 3.07 కోట్ల మందికిపైగా కరోనా సోకగా..4,05,939 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17,90,708 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షల సంఖ్య 42.7కోట్లకు చేరింది.
 
గడిచిన 24 గంటల్లో 44,459 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.98 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.19 శాతానికి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల సంఖ్య కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి.
 
ప్రస్తుతం 4.58లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.49శాతానికి తగ్గింది. నిన్న 40,23,173 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య..36,89,91,222.

సంబంధిత వార్తలు

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments