Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఖీంపూర్‌ఖేరిలో ఉద్రిక్తత-ప్రియాంక గాంధీ అరెస్ట్

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (10:50 IST)
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ఖేరిలో ఉద్రిక్తత నెలకొంది. లఖీంపూర్ వెళ్తుండగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జీ ప్రియాంక గాంధీని సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఐదు గంటల పాటు ప్రియాంక గాంధీ వాద్ర హౌస్ అరెస్ట్‌లో గడిపారు. అనంతరం ఆమె పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నారు. 
 
పార్టీ నాయకుల కారులో లఖీంపూర్‌కు బయలుదేరారు. రైతుల మీదనుంచి దూసుకెళ్లిన కేంద్రమంత్రి తనయుడి కారు ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక గాంధీ వెళుతున్నట్లు సమాచారం.
 
గాయపడిన రైతులను పరామర్శించేందుకు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేష్‌ తికాయత్‌ లఖింపూర్‌ ఖేర్‌ జిల్లాకు చేరుకున్నారు. మొదట గ్రామస్తులు, స్థానికులతో చర్చలు జరుపుతామని అనంతరం భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తికాయత్‌ అన్నారు. తికాయత్‌తో పాటు పలువురు మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి అజరు మిశ్రాని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments