Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఖీంపూర్‌ఖేరిలో ఉద్రిక్తత-ప్రియాంక గాంధీ అరెస్ట్

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (10:50 IST)
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ఖేరిలో ఉద్రిక్తత నెలకొంది. లఖీంపూర్ వెళ్తుండగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జీ ప్రియాంక గాంధీని సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఐదు గంటల పాటు ప్రియాంక గాంధీ వాద్ర హౌస్ అరెస్ట్‌లో గడిపారు. అనంతరం ఆమె పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నారు. 
 
పార్టీ నాయకుల కారులో లఖీంపూర్‌కు బయలుదేరారు. రైతుల మీదనుంచి దూసుకెళ్లిన కేంద్రమంత్రి తనయుడి కారు ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక గాంధీ వెళుతున్నట్లు సమాచారం.
 
గాయపడిన రైతులను పరామర్శించేందుకు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేష్‌ తికాయత్‌ లఖింపూర్‌ ఖేర్‌ జిల్లాకు చేరుకున్నారు. మొదట గ్రామస్తులు, స్థానికులతో చర్చలు జరుపుతామని అనంతరం భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తికాయత్‌ అన్నారు. తికాయత్‌తో పాటు పలువురు మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి అజరు మిశ్రాని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments