Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయాన్ని కాపాడలేని స్టార్ క్యాంపైనర్లు... దీదీకే బెంగాల్ పట్టం

Webdunia
ఆదివారం, 2 మే 2021 (15:28 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలనాథులకు ఆదివారం వెలువడిన ఫలితాలు తేరుకోలేని షాకిచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థుల కోసం మిథున్ చక్రవర్తి లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలను రంగంలోకి దించినా ఓటర్లను ఆకర్షించలేకపోయాయి. ఫలితంగా బెంగాల్ దంగల్‌లో బీజేపీ చతికిలపడగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోమారు విజయభేరీమోగించి, మూడోసారి అధికారాన్న హస్తగతం చేసుకోనుంది. 
 
ఇందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎంతగానే పనిచేశాయని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆయన ఆ మధ్య చేసిన ట్వీట్‌ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. "ఇండియాలో ప్రజాస్వామ్యానికి ఈ సూచికలని, బెంగాల్ ప్రజలు ‘రైట్ కార్డు’ను చూపాలనే నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. బెంగాల్‌కి తన కుమార్తె (మమతా బెనర్జీ) మాత్రమే అవసరమని మే 2న తన చివరి ట్వీట్‌ను చూడడానికి సిద్ధంగా ఉండాలని" ఆయన గత ఫిబ్రవరి 27 న ట్వీట్ చేశారు. 
 
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూసేందుకు ప్రశాంత్ కిషోర్ తన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ టీమ్‌తో ఓ వ్యూహాన్ని రూపొందించారు. ఆ వ్యూహం ఫలించి బెంగాల్‌లో మళ్ళీ దీదీ నేతృత్వంలోని టీఎంసీ.. అత్యధిక సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఇక మూడో సారి పవర్ దిశగా పరుగులు తీస్తోంది. 
 
ఈ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని, 200 సీట్లకు పైగా గెలుస్తామని, తమ రోడ్ షోలు, ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోడీ, అమిత్ షాలు ధీమా వ్యక్తం చేశారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాము 18 సీట్లను గెలుచుకున్నామని, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పంథా సాధిస్తామని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
కానీ బెంగాల్ ఓటర్ల తీరు మరోలా ఉంది. మమత పార్టీకే వారు జై కొట్టారు. బీజేపీ అనేకమంది సినీ, టీవీ స్టార్స్‌ని తమ స్టార్ కాంపెయినర్లుగా రంగంలోకి దింపింది. సీనియర్ బెంగాలీ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సేవలను కూడా ఉపయోగించుకుంది. తన బెంగాలీ సినిమాల్లోని డైలాగులను మిథున్ వల్లించినా ఓటర్లు కొట్టి పారేశారు. అయితే నందిగ్రామ్‌లో సువెందు అధికారి తరఫున మిథున్ చేసిన ప్రచారం మాత్రం ఫలితం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మమతా బెనర్జీ కాస్త వెనుకబడివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments