దేశంలో ఒమిక్రాన్ దూకుడు - 361కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (07:31 IST)
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. గురువారానికి దేశ వ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 361కు చేరింది. వీటిలో ఒక్క తమిళనాడులో ఒకే రోజు ఏకంగా 33 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఒమిక్రాన్ కేసుల జాబితాలో తమిళనాడు మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
ఇప్పటికే డెల్టా వేరియంట్‌ ఓ వైపు భయపెడుతుంది. మరోవైపు, ఒమిక్రాన్ టెన్షన్ ప్రారంభమైంది. ఈ మధ్య భారత్‌లోకి ప్రవేశించిన ఈ వైరస్... క్రమక్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. గురువారం మరో 89 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 361కు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది.  
 
ఢిల్లీలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలను రద్దు చేసింది. అలాగే, ముంబైలో రాత్రిపూట 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చింది. గుజరాత్‌లోని 9 నగరాల్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. కర్నాటక రాష్ట్రంలో సామూహిక వివాహాలపై నిషేధం విధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. ఒమిక్రాన్ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments