Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు తాగొద్దన్నాడనీ యజమానిని హత్య చేసిన సర్వెంట్

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (16:50 IST)
మద్యం తాగవద్దని నివారించినందుకు యజమానిని గొడ్డలితో నరికి చంపిన ఘటన మంగళవారం రాత్రి ఒడిశాలో జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఖుర్దా జిల్లా సిమోరొ గ్రామానికి చెందిన 35 ఏళ్ల సత్యబ్రత అనే యువకుడు ఊళ్లో కొత్త ఇల్లు కట్టాడు. అతని తల్లిదండ్రులు భువనేశ్వర్‌లోని పాత ఇంట్లో ఉంటున్నారు. మరో 20 రోజులలో పెళ్లి కావలసి ఉండగా, సత్యబ్రత ఇంటికి రంగులు వేయించాలని భావించాడు. 
 
రంగులు కొనుగోలు చేయాలని సత్యబ్రత ఆ ఇంట్లో పనిచేసే నరేంద్ర అనే వ్యక్తితో కలిసి కొత్త ఇంటికి వచ్చాడు. నరేంద్రకు మద్యం అలవాటు ఉంది. రోజూ రాత్రి తాగి అల్లరి చేసేవాడు. ఈ దురలవాటు మానివేయమని సత్యబ్రత నరేంద్రను అనేక సార్లు మందలించాడు కానీ వినకపోవడంతో చేయిచేసుకునేవాడు. రంగులు కొనుగోలు చేసి మంగళవారం రాత్రి వారిద్దరూ కొత్త ఇంట్లో నిద్రపోయారు. 
 
ఈ నేపథ్యంలో నరేంద్ర అర్ధరాత్రి లేచి సత్యబ్రత తలపై గొడ్డలితో నరికి చంపేశాడు. 'మద్యం తాగవద్దని అడ్డుపడినందుకు చంపేశాను' అని సుద్ద ముక్కతో గోడపై కారణాన్ని రాసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఖుర్దా పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఖుర్దా ఆసుపత్రికి తరలించారు, నరేంద్ర కోసం గాలింపులు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments