Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు తాగొద్దన్నాడనీ యజమానిని హత్య చేసిన సర్వెంట్

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (16:50 IST)
మద్యం తాగవద్దని నివారించినందుకు యజమానిని గొడ్డలితో నరికి చంపిన ఘటన మంగళవారం రాత్రి ఒడిశాలో జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఖుర్దా జిల్లా సిమోరొ గ్రామానికి చెందిన 35 ఏళ్ల సత్యబ్రత అనే యువకుడు ఊళ్లో కొత్త ఇల్లు కట్టాడు. అతని తల్లిదండ్రులు భువనేశ్వర్‌లోని పాత ఇంట్లో ఉంటున్నారు. మరో 20 రోజులలో పెళ్లి కావలసి ఉండగా, సత్యబ్రత ఇంటికి రంగులు వేయించాలని భావించాడు. 
 
రంగులు కొనుగోలు చేయాలని సత్యబ్రత ఆ ఇంట్లో పనిచేసే నరేంద్ర అనే వ్యక్తితో కలిసి కొత్త ఇంటికి వచ్చాడు. నరేంద్రకు మద్యం అలవాటు ఉంది. రోజూ రాత్రి తాగి అల్లరి చేసేవాడు. ఈ దురలవాటు మానివేయమని సత్యబ్రత నరేంద్రను అనేక సార్లు మందలించాడు కానీ వినకపోవడంతో చేయిచేసుకునేవాడు. రంగులు కొనుగోలు చేసి మంగళవారం రాత్రి వారిద్దరూ కొత్త ఇంట్లో నిద్రపోయారు. 
 
ఈ నేపథ్యంలో నరేంద్ర అర్ధరాత్రి లేచి సత్యబ్రత తలపై గొడ్డలితో నరికి చంపేశాడు. 'మద్యం తాగవద్దని అడ్డుపడినందుకు చంపేశాను' అని సుద్ద ముక్కతో గోడపై కారణాన్ని రాసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఖుర్దా పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఖుర్దా ఆసుపత్రికి తరలించారు, నరేంద్ర కోసం గాలింపులు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments