Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరితో తాళి.. మరొకరితో ప్రేమ.. ఇంకో వ్యక్తితో జంప్.. ఎక్కడ?

ఒకరితో తాళి కట్టించుకుని రెండు రోజులు కాపురం చేసింది. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్ళింది. అతనితో ఐదు రోజుల పాటు సంసారం చేసింది. చివరకు అతను కూడా నచ్చలేదని పేర్కొంటూ మరో వ్యక్తిని తీసుకుని పా

Webdunia
సోమవారం, 16 జులై 2018 (13:59 IST)
ఒకరితో తాళి కట్టించుకుని రెండు రోజులు కాపురం చేసింది. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్ళింది. అతనితో ఐదు రోజుల పాటు సంసారం చేసింది. చివరకు అతను కూడా నచ్చలేదని పేర్కొంటూ మరో వ్యక్తిని తీసుకుని పారిపోయింది. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ జిల్లాకు చెందిన ఓ యువతికి పెద్దలు అదేప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేశారు. అతనితో రెండు రోజులపాటు కాపురం చేసింది. ఆ తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసింది. అతనితో మరో ఏడడుగులు వేసింది. ఇతడితో కేవలం ఐదు రోజులు మాత్రమే సంసారం చేసింది. ఆ తర్వాత మరో వ్యక్తితో జంప్‌ అయింది. ఇది కొరాపుట్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 
 
దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూలదండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండో భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్‌ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్‌ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments