Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిపై పట్టాలు తప్పిన గూడ్సు రైలు

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:26 IST)
Train
ఒడిషా రాష్ట్రంలో ఓ గూడ్సు రైలు నదిపై పట్టాలు తప్పింది. ఫిరోజ్‌ న‌గ‌ర్ నుంచి ఖుర్దా రోడ్‌కు వెళ్తున్న స‌రుకు ర‌వాణా రైలు ఒడిశాలోని అంగుల్ రైల్వేస్టేష‌న్ దాటిన త‌ర్వాత తాల్చేర్ రోడ్‌కు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ప‌ట్టాలు త‌ప్పింది. 
 
ఈ ప్ర‌మాదంలో రైలులోని 9 వ్యాగ‌న్‌లు బోల్తాప‌డ్డాయి. మ‌రో వ్యాగ‌న్ ప‌ట్టాలు త‌ప్పి నిలిచిపోయింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 2:35 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. 
 
తాల్చేర్ రోడ్డుకు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఓ న‌ది వంతెన‌పై రైలు ప‌ట్టాలు త‌ప్పింద‌ని, అయితే రైల్లోని ఒక్క వ్యాగ‌న్ కూడా నీళ్ల‌లో ప‌డ‌లేద‌ని రైల్వే అధికారులు చెప్పారు. అదేవిధంగా ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగలేద‌ని, ఎవ‌రికీ గాయాలు కూడా కాలేదని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments