Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సా సీఎం సంచలన నిర్ణయం : 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు...

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (11:55 IST)
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 76వ పుట్టిన రోజు వేడుకలు ఆయన శనివారం జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొలువులను రెగ్యులైజ్ చేశారు. పైగా, రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఏకంగా రూ.1300 కోట్ల భారంపడనుంది. 
 
ఈ మేరకు శనివారం తన సారథ్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. 
 
ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిని శాశ్వతంగా రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్లు లేవని, కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్ జరుగుతోందని గుర్తు చేశారు. 
 
ఒరిస్సాలో దానికి ఇప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా 57 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రకటన చేయగానే కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. దీపావళి పండుగ ముందే వచ్చిందంటూ స్వీట్లు పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments