Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం... మంచి నిర్ణయం తీసుకోండి.. శశి వర్గీయులకు ఓపీఎస్ లేఖ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులకు ఓ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:09 IST)
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులకు ఓ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన ఈ లేఖ విడుదల చేశారు. 
 
పార్టీలో వివాదాలు తాత్కాలికమని, మనమంతా ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తున్నారని, ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు. 
 
అమ్మ అసంపూర్తిగా మిగిల్చిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనులపై దృష్టి పెట్టాలని పన్నీర్ సెల్వం సూచించారు. ఏ పార్టీ మద్దతు, సహకారం లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments