Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నగారి విగ్రహం తెనాలిలో తయారై.. బెంగళూరు పార్కుకు వెళ్లింది.. ఎంజీఆర్ విగ్రహం కూడా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జె.పి పార్కులో ప్రతిష్టించనున్నారు. ఈ పార్కులో ప్రతిష్టించనున్న విగ్రహా

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (10:00 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జె.పి పార్కులో ప్రతిష్టించనున్నారు. ఈ పార్కులో ప్రతిష్టించనున్న విగ్రహాల తయారీకి కళల కాణాచి తెనాలి వేదికైంది. విగ్రహాల తయారీలో తెనాలికున్న పేరు ప్రఖ్యాతులు తెలుసుకున్న ఆ రాష్ట్ర ఎమ్మెల్యే మునిరత్నం పట్టణానికి చెందిన శిల్పి కాటూరి రవిచంద్రను సంప్రదించారు.
 
దేశానికి చెందిన 34 మంది ప్రముఖుల విగ్రహాలను తయారు చేసేందుకు ప్రణాళిక వేసి.. మూడు నెలల కాలంలో ఫైబర్ విగ్రహాలను తీర్చిదిద్దారు. ఇందులో చత్రపతి శివాజీ, టిప్పు సుల్తాన్‌, ఝాన్సీరాణి, బాబూరాజేంద్ర ప్రసాద్‌, నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌, అంబేడ్కర్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, భగత్‌సింగ్‌, మడకరి నాయక, సంగోలి రాయన్న, జయచామరాజ వడయార్‌, ఇందిరాగాంధీ, పింగళి వెంకయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్యల విగ్రహాలున్నాయి. 
 
అంతేగాకుండా ఎన్టీ రామారావు, ఎం.జి.రామచంద్రన్‌, రాజకుమార్‌, ప్రేమ్‌ నజీర్‌, కె.సి.రెడ్డి, వినాయక కృష్ణ గోకక్‌, హనుమంతయ్య, చంద్రశేఖర్‌ కుమార్‌, మస్తి వెంకటేష్‌ అయ్యంగార్‌ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. శనివారం వీటిని బెంగళూరుకు తరలించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments