Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివసేన ఎంపీ నోటిదూల.. డబ్బులు లేవని పోలీసులను బూతులు తిట్టాడు... ఏటీఎం ఎదుట ఆదోళన

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. చేతివాటం, నోటి దురుసుతనం ఏమాత్రం తగ్గలేదు. ఎయిరిండియా మేనేజర్‌ని చెప్పుతో కొట్టిన ఘటనలో ఆయన నైజం దేశ ప్రజలకు తెలిసింది. ఇపుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది... మరఠ్వాడా ప్రా

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:35 IST)
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. చేతివాటం, నోటి దురుసుతనం ఏమాత్రం తగ్గలేదు. ఎయిరిండియా మేనేజర్‌ని చెప్పుతో కొట్టిన ఘటనలో ఆయన నైజం దేశ ప్రజలకు తెలిసింది. ఇపుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది... మరఠ్వాడా ప్రాంతంలోని లాతూర్‌లో ఏటీఎం సరిగా పనిచేయడంలేదంటూ.. పోలీసులపై తిట్లపురాణం అందుకున్నారాయన. గైక్వాడ్‌తో పాటు ఆయన అనుచరగణం కూడా పోలీసులపై ఇష్టారీతిన మాటలు వదలడంతో కొందరు ఆ సంభాషణలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇపుడు ఇవి వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వివాదానికి కారణాలు పరిశీలిస్తే... బుధవారం లాతూర్ వచ్చి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు తన అనుచరుడొకరిని ఏటీఎంలోకి పంపారు. అయితే అందులో డబ్బులు లేవంటూ అతడు ఒట్టిచేతులతో తిరిగొచ్చాడు. మిగతా కొన్ని ఏటీఎంలలో కూడా అదేపరిస్థితి ఉండడంతో... ఎంపీ ఓ ఏటీఎం ముందు తన మద్దతుదారులతో కలిసి ఆందోళన మొదలుపెట్టారు.
 
'నోట్లరద్దు తర్వాత సాధారణ పరిస్థితి వచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని 50 రోజుల సమయం అడిగింది. వాళ్లకు మేం 100 రోజులు.. ఆ తర్వాత 200 రోజులు సమయం ఇచ్చాం. దీని బాధ్యత కేంద్ర, రాష్ట్రాల ఆర్థక మంత్రులదే...' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్‌ స్తంభించడంతో... ఆందోళన విరమించాలని పోలీసులు గైక్వాడ్‌ను కోరారు. కానీ, ఆయన మాత్రం పోలీసులపై గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేసినట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments