Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివసేన ఎంపీ నోటిదూల.. డబ్బులు లేవని పోలీసులను బూతులు తిట్టాడు... ఏటీఎం ఎదుట ఆదోళన

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. చేతివాటం, నోటి దురుసుతనం ఏమాత్రం తగ్గలేదు. ఎయిరిండియా మేనేజర్‌ని చెప్పుతో కొట్టిన ఘటనలో ఆయన నైజం దేశ ప్రజలకు తెలిసింది. ఇపుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది... మరఠ్వాడా ప్రా

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:35 IST)
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. చేతివాటం, నోటి దురుసుతనం ఏమాత్రం తగ్గలేదు. ఎయిరిండియా మేనేజర్‌ని చెప్పుతో కొట్టిన ఘటనలో ఆయన నైజం దేశ ప్రజలకు తెలిసింది. ఇపుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది... మరఠ్వాడా ప్రాంతంలోని లాతూర్‌లో ఏటీఎం సరిగా పనిచేయడంలేదంటూ.. పోలీసులపై తిట్లపురాణం అందుకున్నారాయన. గైక్వాడ్‌తో పాటు ఆయన అనుచరగణం కూడా పోలీసులపై ఇష్టారీతిన మాటలు వదలడంతో కొందరు ఆ సంభాషణలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇపుడు ఇవి వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వివాదానికి కారణాలు పరిశీలిస్తే... బుధవారం లాతూర్ వచ్చి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు తన అనుచరుడొకరిని ఏటీఎంలోకి పంపారు. అయితే అందులో డబ్బులు లేవంటూ అతడు ఒట్టిచేతులతో తిరిగొచ్చాడు. మిగతా కొన్ని ఏటీఎంలలో కూడా అదేపరిస్థితి ఉండడంతో... ఎంపీ ఓ ఏటీఎం ముందు తన మద్దతుదారులతో కలిసి ఆందోళన మొదలుపెట్టారు.
 
'నోట్లరద్దు తర్వాత సాధారణ పరిస్థితి వచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని 50 రోజుల సమయం అడిగింది. వాళ్లకు మేం 100 రోజులు.. ఆ తర్వాత 200 రోజులు సమయం ఇచ్చాం. దీని బాధ్యత కేంద్ర, రాష్ట్రాల ఆర్థక మంత్రులదే...' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్‌ స్తంభించడంతో... ఆందోళన విరమించాలని పోలీసులు గైక్వాడ్‌ను కోరారు. కానీ, ఆయన మాత్రం పోలీసులపై గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేసినట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments