లాక్‌డౌన్ ఎత్తివేయడం అనుమానమే అంటున్న బీజేపీ నేత!!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (17:50 IST)
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది వచ్చే నెల మూడో తేదీ వరకు అమల్లోవుండనుంది. ఆ తర్వాత ఈ లాక్‌డౌన్ ఎత్తివేస్తారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మే 15వ తేదీ వరకు మరోసారి పొడగించనున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో లాక్‌డౌన్ పొడగింపు, ఎత్తివేతపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. 
 
మరోవైపు, ఈ లాక్‌డౌన్ అంశంపై బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. మే 3వ తేదీ తర్వాత లాక్‌‌డౌన్‌ తొలగిస్తారో, లేదో ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని, ఆ సమయానికి దేశంలోని కరోనా వ్యాప్తిని బట్టి తదుపరి నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ అడ్డుకట్టకు రాష్ట్రాలన్నీ ఐకమత్యంతో పోరాటం కొనసాగిస్తున్నాయని, రాజకీయాలను పక్కనబెట్టి, ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారన్నారు. కనీసం మరో యేడాది పాటు దేశంలో బహిరంగ సభలు, సమావేశాలు ఉండక పోవచ్చని ఆయన అంచనా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RC 17: పుష్ప 3 కు బ్రేక్ - రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్.సి. 17 రెడీ

Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల రిలీజ్ అనౌన్స్‌మెంట్

Dude: ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారా !

K. Ramp Review: కిరణ్ అబ్బవరం.. కె. ర్యాంప్ తో సక్సెస్ సాధించాడా... కె. ర్యాంప్ రివ్యూ

Harish Shankar: ప‌వ‌న్ క‌ల్యాణ్... ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి నిర్మాత తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments