Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఎత్తివేయడం అనుమానమే అంటున్న బీజేపీ నేత!!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (17:50 IST)
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది వచ్చే నెల మూడో తేదీ వరకు అమల్లోవుండనుంది. ఆ తర్వాత ఈ లాక్‌డౌన్ ఎత్తివేస్తారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మే 15వ తేదీ వరకు మరోసారి పొడగించనున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో లాక్‌డౌన్ పొడగింపు, ఎత్తివేతపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. 
 
మరోవైపు, ఈ లాక్‌డౌన్ అంశంపై బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. మే 3వ తేదీ తర్వాత లాక్‌‌డౌన్‌ తొలగిస్తారో, లేదో ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని, ఆ సమయానికి దేశంలోని కరోనా వ్యాప్తిని బట్టి తదుపరి నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ అడ్డుకట్టకు రాష్ట్రాలన్నీ ఐకమత్యంతో పోరాటం కొనసాగిస్తున్నాయని, రాజకీయాలను పక్కనబెట్టి, ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారన్నారు. కనీసం మరో యేడాది పాటు దేశంలో బహిరంగ సభలు, సమావేశాలు ఉండక పోవచ్చని ఆయన అంచనా వేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments