Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వీట్లు చేస్తోంది నేనే. దెయ్యం కాదు... సుష్మా స్వరాజ్

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (16:52 IST)
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఓ నెటిజన్‌కు ఘాటైన సమాధానం ఇచ్చారు. విదేశాల్లో ఆపదలో ఉన్న ఎంతో మంది భారతీయులను ఆమె రక్షించారు. మరికొంతమందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చారు. పైగా, విదేశాల్లో ఉన్నవారికి ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సుష్మాకు ట్వీట్‌ చేస్తూ.. 'మేడమ్‌.. మీరు మా విదేశాంగ మంత్రి అనుకున్నాం. భాజపాలో ఉన్న ఏకైక తెలివైన వ్యక్తి మీరే అనుకున్నాం. అలాంటప్పుడు ఎందుకు మీ ముందు చౌకీదార్‌ అని పెట్టుకున్నారు?' అని ప్రశ్నించారు. దీనికి సుష్మా సమాధానమిస్తూ, 'ఎందుకంటే నేను భారతీయ ప్రజల ఆసక్తులకు, విదేశాల్లో ఉంటున్న భారతీయులకు చౌకీదార్‌ (కాపలాదారు)ని కాబట్టి' అని రిప్లై ఇచ్చారు. 
 
ఆ తర్వాత సుష్మా రిప్లైకు సమిత్‌ అనే నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 'ఈ ట్వీట్లన్నీ చేస్తోంది సుష్మా స్వరాజ్‌ కాదు. ఆమె ఇస్తున్న జీతానికి పీఆర్‌ చేస్తున్న పని ఇది' అని ట్వీట్ చేశాడు. దీనికి ఆమె ఘాటైన సమాధానమిచ్చారు. 'ఎలాంటి సందేహం లేదు.. ట్వీట్లు చేస్తోంది నేనే. దెయ్యం కాదు' అని తనదైనశైలిలో సమాధానమిచ్చారు. 
 
ఈ ట్వీట్‌కు విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే 10 వేలమందికి పైగా నెటిజన్లు లైక్ చేయగా, అనేక వందల మంది ఈ ట్వీట్‌ను షేర్ చేశారు. ఈ ట్వీట్‌ ద్వారా తనలోని హాస్య చతురతను సుష్మా స్వరాజ్ చాటిచెప్పారని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments