Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ట్రాసౌండ్ స్కాన్‌లో కనిపించిన కవలలు.. ఆపరేషన్ చేసి ఒక్క బిడ్డనే తీసిన వైద్యులు!

గర్భిణి మహిళను పరిక్షించిన వైద్యులు ఆమెకు కవల పిల్లలు పుడతారని చెప్పి తీరా డెలివరీ అయ్యాక ఒక బిడ్డనే చేతికిచ్చిన ఘటన ఢిల్లీ శివారులోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన 23 ఏ

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (12:43 IST)
గర్భిణి మహిళను పరిక్షించిన వైద్యులు ఆమెకు కవల పిల్లలు పుడతారని చెప్పి తీరా డెలివరీ అయ్యాక ఒక బిడ్డనే చేతికిచ్చిన ఘటన ఢిల్లీ శివారులోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన 23 ఏళ్ల సంగీతాదేవి ఈ నెల 20న పురిటినొప్పులతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆమెకు పురుడు పోసిన వైద్యులు ఒకే ఒక బిడ్డను చేతికిచ్చారు. అయితే.. డెలివరీకి ముందు కవలపిల్లలను పుడతారని వైద్యులు చెప్పారని.. ఇప్పుడు ఒక బిడ్డనే ఇచ్చారని సంగీత ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించినప్పుడు తన గర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వైద్యులు చెప్పారని చెప్పింది. అంతేకాక కవల పిల్లల వల్ల తనకు సహజ ప్రసవం అవ్వడం కష్టమని.. శస్త్రచికిత్స చేసేందుకు డాక్టర్లు తమ వద్ద సంతకం కూడా తీసుకున్నారని వాపోయింది. 
 
ఇదిలావుంటే.. .తమ బిడ్డను ఆసుపత్రి యాజమాన్యమే తీసుకుందని సంగీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ... ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన ఆసుపత్రి చీఫ్‌ సూపరిండెంట్‌.. ఘటనపై విచారణకు ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments