కూరగాయలు కోసం ముప్పై రూపాయలు అడిగితే..? ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు..

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (12:53 IST)
ఢిల్లీలో ట్రిపుల్ తలాక్ కథ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంటికి కావలసిన కూరగాయలు కొనేందుకు డబ్బు అడిగిన భార్యకు.. ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి సమీపంలో ధాత్రి ప్రాంతంలో సబీర్ అనే వ్యక్తి తన భార్య సైనాబ్‌తో కలిసి జీవిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సైనాబ్ తన భర్త కూరగాయలు కొనేందుకు రూ.30లు అడిగింది. 
 
కానీ కావాలనే ఆ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించిన భర్త.. ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఈ వాగులాట ముదరడంతో రోడ్డుపై నిల్చుని ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. న్యాయం కోసం సైనాబ్.. సబీర్ ఇంటికి వెళ్లగా ఆమెకు ఘోర అవమానం జరిగింది. 
 
కుటుంబంతో కలిసి సైనాబ్‌ను సబీర్ దాడి చేశాడు. ముఖంపైనే ఉమ్మేశాడు. దీంతో షాకైన సైనాబ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబీర్‌ను అరెస్ట్ చేశారు. ఇంకా అజ్ఞాతంలోకి వెళ్లిన సబీర్ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments