Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేషనల్ హై వే పైన నవంబరు 18 వరకు టోల్ ఫ్రీ... గడువు పెంచిన గడ్కారీ

న్యూఢిల్లీ : నవంబరు 18 వరకు వాహనదారులు టోల్ ఫీజు కట్టనవసరం లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఎటువంటి రుసుము చెల్లించకుండానే ప్రయాణం చేసే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో కరెన్సీ మార్పిడి నేపథ్యంలో సామాన్య ప్రజలు అవస్థలు పడు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (20:01 IST)
న్యూఢిల్లీ :  నవంబరు 18 వరకు వాహనదారులు టోల్ ఫీజు కట్టనవసరం లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఎటువంటి రుసుము చెల్లించకుండానే ప్రయాణం చేసే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో కరెన్సీ మార్పిడి నేపథ్యంలో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్న దరిమిలా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 
 
500, 1000 నోట్లు రద్దయిన వెంటనే దేశంలో కలకలం రేగింది. ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద చిల్లర లేక, వాహనాలు జామ్ అయిపోయాయి. వెంటనే స్పందించిన కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబరు 14 వరకు టోల్ ఎత్తి వేశారు. కానీ, ఇంకా నోట్ల సర్దుబాటు కాకపోవడంతో ఈ గడువును మరో నాలుగు రోజులు పొడిగించారు. టోల్ గేట్స్ వద్ద నవంబర్ 18 వరకు వాహనదారుల నుండి టోల్ టాక్స్ వసూల్ చేయవద్దని కేంద్ర మంత్రి గడ్కారీ తన ట్విటర్లో తాజాగా తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments