Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో స్థలం లేదు.. అందుకే టాయ్‌లెట్‌లో 7 రోజులు క్వారంటైన్‌లో వున్నాడు..

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (13:05 IST)
కరోనా వైరస్ విస్తరించడంతో క్వారంటైన్ కేంద్రాలు తక్కువగా వున్నాయి. ఆస్పత్రిలో వారం రోజులకు పైగా వుంచలేమని చెప్పడంతో.. కుటుంబ భద్రత కోసం.. ఓ 28ఏళ్ల వ్యక్తి బాత్రూమ్‌లోనే క్వారంటైన్‌ను కొనసాగించాడు. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగం పరంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు కరోనా వ్యాప్తి కారణంగా తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. అలాగే తమిళనాడులో ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల యువకుడు మానస్ పత్రా తన సొంత ఊరు ఒడిశాకు తిరిగి వెళ్లాడు. 
 
ఒడిశాలోకి ఎంటర్ కాగానే వారం రోజుల పాటు సుదుకాంతి పాఠశాలలో ప్రభుత్వం నడుపుతున్న తాత్కాలిక వైద్య శిబిరం క్వారెంటైన్‌లో ఉంచారు అధికారులు. కరోనా లక్షణాలేమీ కనిపించకపోవడంతో ఏడు రోజులకు డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత హోమ్ క్వారెంటైన్ మరో వారం రోజులపాటు ఉండాలని చెప్పారు.
 
ఆరు మంది కుటుంబ సభ్యులున్నతన ఇంట్లో తగినంత స్ఠలం లేదు. టిఎంసిలో తన బసను పొడిగించాలని మానస్ పత్రా కోరాడు. పొడిగింపుకు అనుమతి లేదని అధికారి తెలిపారు.

ఇంట్లో మరొక గది లేకపోవడంతో కుటుంబ సభ్యుల భద్రత కోసం టాయిలెట్‌లో ఉండాల్సిన వచ్చిందని పత్రా చెప్పుకొచ్చాడు. అతను కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డిలోనే జూన్ 9 నుండి 15 వరకు ఏడు రోజులు గడిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments