Webdunia - Bharat's app for daily news and videos

Install App

2000 కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ లేదు: ఆర్బీఐ

Webdunia
శనివారం, 29 మే 2021 (09:35 IST)
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గురువారం తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కూడా కొత్తగా నోట్లు తీసుకు రాలేదని తెలిపింది.

ఆర్బీఐ మే 26వ తేదీన వార్షిక నివేదిక విడుదల చేసింది. FY21లో మొత్తంగా పేపర్ క్యాష్ సరఫరా 0.3 శాతం మేర తగ్గి 2,23,301 లక్షల నోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 2,23,875 లక్షల కరెన్సీ నోట్లు సరఫరా అయ్యాయి.
 
ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వ్యాల్యూ కలిగిన డినామినేషన్ రూ.500, రూ.2000 నోట్లు. కరెన్సీ సరఫరాలో ఈ రెండింటి వ్యాల్యూ 85.7 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అధిక విలువ కలిగిన ఈ కరెన్సీ వ్యాల్యూ వాటా ఎక్కువ. అంతకుముందు ఎడాది 83.4 శాతంగా ఉంది. వ్యాల్యూమ్ పరంగా రూ.500 డినామినేషన్ కలిగిన నోట్ల వాటా 31.1 శాతం.
 
రూ.2000 నోట్లు ప్రింట్ చేయలేదని గత ఏడాది వార్షిక నివేదికలోను ఆర్బీఐ పేర్కొంది. 2018 నుండి వ్యవస్థలో రూ.2000 నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2018 మార్చి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షల నోట్లు, 2020 చివరి నాటికి 27,398 లక్షల నోట్లకు తగ్గాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments