Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాక్ట్ చెక్ :: 25 నుంచి మళ్లీ లాక్డౌన్ ... క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (10:05 IST)
దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఈ నెల 25వ తేదీ నుంచి మళ్లీ లాక్డౌన్ విధించనున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఫ్యాక్ట్ చెక్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిని తప్పుడు వార్తగా నిర్ధారించి ‘ఫేక్ న్యూస్’ అలెర్ట్‌లో పోస్టు చేసింది. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో రోజుకు కనీసం 80 వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెల 25 నుంచి దేశవ్యాప్తంగా మరోమారు లాక్డౌన్ విధించబోతున్నారంటూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) పేరుతో ఓ సర్క్యులర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ సర్క్యులర్‌లో "కరోనా వైరస్ మరణాల రేటు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెప్టెంబరు 25 నుంచి దేశవ్యాప్తంగా 46 రోజులపాటు కఠిన లాక్డౌన్‌ను అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్‌తో కలిసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, అత్యవసర వస్తువులను మాత్రం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. 
 
ఈ మేరకు ఇందుకు అనుగుణంగా సిద్ధమవుతారన్న ఉద్దేశంతో ఎన్‌ఎండీఏ ముందస్తు నోటీసు జారీ చేసింది" అని ఈ నెల 10వ తేదీన ఈ సర్క్యులర్ జారీ అయినట్టుగా ఉంది. దీనిపై ప్రభుత్వ అధికారిక మీడియా అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. మరోమారు లాక్డౌన్‌పై ఎలాంటి సర్క్యులర్ జారీకాలేదనీ, ఈ సర్క్యులర్ పూర్తిగా ఫేక్ అంటూ తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments