Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 31తో ముగిసిన తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య పదవీకాలం

తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య (83) పదవీకాలం బుధవారం (ఆగస్టు 31)తో ముగిసింది. దీంతో ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (17:31 IST)
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య (83) పదవీకాలం బుధవారం (ఆగస్టు 31)తో ముగిసింది. దీంతో ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
నిజానికి కె.రోశయ్య పదవీకాలం ముగియనుండడంతో ఆయన పదవీకాలం పొడిగిస్తారని, ఇదే అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి లేఖ రాశారంటూ వార్తలు వెలువడిన సంగతితెలిసిందే. తాజా నిర్ణయంతో ఊహాగానాలకు తెరపడింది. 
 
దీంతో కె.రోశయ్య ఇకపై శేషజీవితాన్ని తన సొంతూరు చీరాలలో గడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే వయోభారంతో బాధపడుతున్న రోశయ్య... సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments