Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డులకెక్కిన తెలుగింటి కోడలు..

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (08:33 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో తెలుగింటి కోడలు నిర్మాలా సీతారామన్‌కు కీలకపదవి దక్కింది. ఈమె టీడీపీ సర్కారు మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ సతీమణి. ఈ తెలుగింటి కోడలు దేశ ఆర్థిక మంత్రిగా ఆమె నియమితులయ్యారు. ఎంఏలో ఆర్థిక శాస్త్రం పూర్తిచేసిన నిర్మలా సీతారామన్.. గత మంత్రివర్గంలో దేశ రక్షణ శాఖామంత్రిగా ఉన్నారు. ఇపుడు మరింత ప్రమోషన్ ఇచ్చి.. ఆర్థికమంత్రిగా నియమించారు. దీంతో ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పారు.
 
పైగా, దేశ ఆర్థిక శాఖను నిర్వహించనున్న రెండో మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈమె 1970లో ఒక యేడాది పాటు ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించారు. 
 
అదేవిధంగా అమిత్ షా ను కేంద్ర హోంమంత్రిగా నియమించగా, దేశ రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్‌ను ఎంపిక చేశారు. భారత విదేశాంగ మంత్రిగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం జయశంకర్‌ను మోడీ ఎంపిక చేశారు. 
 
కాగా, మే 30వ తేదీ రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన తన మంత్రివర్గంలో 24 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్ర సహాయ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులను నియమించుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments