Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలాదేవిపై మరో ఇద్దరు అమ్మాయిల ఫిర్యాదు.. అందుకే ఆ తప్పు చేసిందట?

కాలేజీలో చదివే అమ్మాయిలను మాయ మాటలు చెప్పి... విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్‌ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి కేసులో పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (11:57 IST)
కాలేజీలో చదివే అమ్మాయిలను మాయ మాటలు చెప్పి... విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్‌ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి కేసులో పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ కేసులో అరెస్టయిన నిర్మలా దేవి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.


విద్యార్థినులతో జరిపిన ఫోన్ సంభాషణలు వెలుగులోకి రావడంతో ఈ కేసును సీబీసీఐడి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మలా దేవిపై మరో ఇద్దరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. 
 
ఈ వ్యవహారంలో నిర్మలాదేవికి సహకరించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, రీసెర్చ్ స్టూడెంట్ కరుప్పు స్వామి అనే వ్యక్తిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ప్రొఫెసర్ మురగన్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అంతేగాకుండా నిర్మలాదేవి వద్ద పోలీసులు జరిపిన దర్యాప్తులో తన కుమార్తెకు మెడికల్ సీటును పొందేందుకు రూ.30 లక్షలు ఇచ్చి తాను మోసపోయానని వెల్లడించినట్టు తెలుస్తోంది. తాను మోసపోయిన డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మాయిలను ఎరవేసేందుకు ప్రయత్నించినట్టు సీబీసీఐడీ పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం