Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిర్భయ' దోషులకు ఉరి అమలు అనుమానమే... కొనసాగుతున్న స్వాతి మలివాల్ దీక్ష

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (12:17 IST)
నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలుచేయాలంటూ నిర్భయ తల్లి ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణను అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌కుమార్‌ అరోరా ఈ నెల 17కి వాయిదా వేశారు. దీంతో ఈ నెల 16వ తేదీన దోషులకు ఉరిశిక్ష అమలు అనుమానాస్పదంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో అది సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. 
 
మరోవైపు, నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ చేపట్టిన దీక్ష 10వ రోజుకు చేరింది. రాజ్‌ఘాట్‌లోని సమతాస్థల్‌ వద్ద స్వాతి మలివాల్‌ దీక్ష కొనసాగిస్తున్నారు. 
 
కాగా, శుక్రవారం దీక్షాశిబిరాన్ని నిర్భయ తల్లి సందర్శించి స్వాతికి మద్దతు తెలిపారు. నిర్భయకు న్యాయం జరుగాలంటూ స్వాతి మాలివాల్‌ గత 10 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలుచేసి స్వాతి మలివాల్‌ దీక్ష విరమించేలా చూడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
 
16నే ఉరితీయాలి : నిర్భయ తల్లి 
తన కుమార్తెపై సామూహిక లైంగికదాడి జరిపి దారుణంగా హింసించిన దోషులను డిసెంబర్‌ 16లోపే (ఘటన జరిగిన రోజు) ఉరితీయాలని నిర్భయ తల్లి డిమాండ్‌ చేశారు. 'నిందితులకు కోర్టు ఉరిశిక్ష ప్రకటించి రెండున్నరేండ్లు అవుతున్నది. వారి రివ్యూ పిటిషన్లను కూడా తిరస్కరించి ఇప్పటికి 18 నెలలు కావస్తున్నది. అయినప్పటికీ వారిని ఉరితీయలేదు. దోషులను వెంటనే ఉరితీయాలని కోర్టును, ప్రభుత్వాన్ని కోరుతున్నా' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments