Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులకి ఉరి: తీహార్ జైలుకి చేరుకున్న పవన్

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (20:47 IST)
నిర్భయ దోషులు తమకు విధించిన ఉరి శిక్ష నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గత కొన్ని రోజులుగా చేస్తున్న యత్నాలన్నీ ఫలించలేదు. దీనితో మరో రెండు రోజుల్లో వారిని ఉరి తీయనున్నారు. ఈ నేపధ్యంలో వారిని ఉరి తీసేందుకు మీరట్ నుంచి తలారి పవన్ జల్లాద్ తీహార్ జైలుకి చేరుకున్నారు. ఆయనకు అవసరమైన సౌకర్యాలను జైలు ప్రాంగణంలో జైలు అధికారులు ఏర్పాటు చేశారు. 
 
ఫిబ్రవరి ఉదయం నిర్భయ దోషులను ఉరి తీయనున్న నేపధ్యంలో డమ్మీలతో రేపు ట్రయల్స్ నిర్వహించున్నట్లు సమాచారం. అలాగే బక్సర్ నుంచి తెప్పించిన ఉరి తాళ్ల సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తారని చెపుతున్నారు. 
 
తీహార్ కారాగార ప్రాంగణంలోని 3వ నెంబర్ జైలులో నిర్భయ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. దోషుల్లో ఇప్పటివరకూ ఒకరొకరుగా వేసుకున్న పిటీషన్లన్నీ కొట్టివేయబడ్డాయి. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు ప్రాణభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి పిటీషన్ పెట్టుకున్నాడు. అది పెండింగులో వుంది. ఉరి వేసేందుకు మరో రెండ్రోజులే సమయం వున్నందున దీనిపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments