Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిర్భయ' దోషులను ఎందుకు ఉరితీయరు?

గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (09:16 IST)
గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలను ఇంకా ఉరి ఎందుకు తీయడం లేదనీ ఢిల్లీ మహిళా కమిషన్ నిలదీసింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులతో పాటు.. దక్షిణ ఢిల్లీ జిల్లా డీసీపీకి డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ నోటీసులు జారీ చేశారు. 
 
తమ కుమార్తెపై దారుణంగా మూకుమ్మడి అత్యాచారం చేసి చంపేసిన కేసులో దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ధ్రువీకరించిన ఆరు నెలల తర్వాత కూడా వారిని ఉరి తీయలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసు ఇచ్చామని కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
 
కాగా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌, క్యూరేటివ్‌ పిటిషన్‌, న్యాయ మార్గాల తర్వాత చిట్టచివరగా రాష్ట్రపతిని క్షమాభిక్ష వేడుకునే వంటి అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ మరణశిక్ష పడిన ఆ నలుగురి విషయంలో డీసీడబ్ల్యూ నోటీసు జారీ చేయడం విశేషం. దీనిపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments