Webdunia - Bharat's app for daily news and videos

Install App

కఠిన ఆంక్షల దిశగా యూపీ సర్కారు - 25 నుంచి రాత్రి కర్ఫ్యూ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:57 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇది రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. 
 
అలాగే, వివాహాది శుభకార్యాలకు కూడా ఆంక్షలు విధించింది. కేవలం 200 మందికి మించి పాల్గొనకుండా నిబంధన విధించింది. పైగా, ఇలాంటి కార్యక్రమాలకు హాజరైన వారంతా విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచన చేసింది. 
 
దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రం రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తుంది. ఇపుడు యూపీ సర్కారు కూడా ఈ తరహా ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు యూపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments