Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ కేపిటల్‌లో రోబో సాయంతో భారీ పేలుళ్ళకు కుట్ర

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (14:42 IST)
దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు మహానగరంలో ఉగ్రసంస్థ ఐసిస్‌ సహకారంతో భారీ పేలుళ్లకు పాల్పడేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నారని ఎన్.ఐ.ఏ ఆరోపిస్తుంది. దేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడేందుకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) విచ్ఛిన్నం చేసి, ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా వీరిపై చార్జిషీటును తాజాగా సమర్పించింది. 
 
ఆ కుట్ర కేసులో మహ్మద్‌ షరీఖ్‌ (25), మాజ్‌ మునీర్‌ అహ్మద్‌ (23), సయ్యద్‌ యాసిన్‌ (22), రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌ (22), హుజైర్‌ ఫర్హాన్‌ బేగ్‌ (22), మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ (22), కేఏ నదీం అహ్మద్‌ (22) జబీవుల్లా (32), ఎన్‌.నదీమ్‌ ఫాజిల్‌ (27) అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. 
 
రీషాన్‌ తాజుద్దీన్‌ షేక్‌, మాజిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌, కేఏ నదీం అహ్మద్‌ అనే వారు మెకానికల్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేయగా మరో ఇద్దరికి సాంకేతిక విద్యానేపథ్యం ఉందని గుర్తించారు. దాన్ని ఉపయోగించుకుని రోబోట్లు, డ్రోన్‌ల సాయంతో దాడులకు ప్రణాళికలను రూపొందించారని ఎన్‌ఐఏ తన అదీనపు అభియోగపత్రంలో పేర్కొంది. భద్రా నదీ తీరంలో తాము తయారు చేసిన బాంబును పేల్చారని ఇప్పటికే ఒక అభియోగపత్రంలో ఎన్‌ఐఏ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments