Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

సెల్వి
శుక్రవారం, 16 మే 2025 (20:22 IST)
తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలో నాలుగు నెలల గర్భిణి దివ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణించిన శోకంలో భర్త ప్రతాప్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై జిల్లా వనవాసిని ఆడుళ్ల విళంగాడు గ్రామాన్ని చెందిన వేలు అనే వ్యక్తి కుమార్తె దివ్య (19). ఇతనికి, వందవాసి, విలంగాడు గ్రామానికి చేరిన చెల్లప్పన్ కుమారుడు ప్రతాప్ (25) గత ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు. 
 
ప్రతాప్ చెన్నై ప్రైవేట్ లారీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ వచ్చాడు. ఇక ప్రతాప్ భార్య దివ్య 4 నెలల గర్భవతి. అయితే గత 10 రోజుల క్రితం దివ్య తల్లి ఇంటికి వెళ్లింది. కానీ గత రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఒక్కసారిగా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దివ్య కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయం తెలిసి ప్రతాప్ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. 
 
భార్య మరణించిన విషయాన్ని ప్రతాప్ జీర్ణించుకోలేకపోయాడు. భార్య మరణవార్త విని చేతిలో విషంతో బస్సెక్కిన ప్రతాప్ మార్గమధ్యంలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో 4 నెలల గర్భిణి దివ్య తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చింది. దీని కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలియవచ్చింది. భార్య లేని శోకంలోనే భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం