Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రోజున చికెన్ కూర కలిపిన అన్నంలో విషం కలుపుకుని..?

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (14:44 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు.. కానీ ఏమైందో ఏమో కానీ శోభనం రోజు రాత్రే అనూహ్య ఘటన జరిగింది. వధూవరులు ఇద్దరూ విషం తాగేశారు. విషమ పరిస్థితుల్లో ఉన్న వాళ్లిద్దరినీ బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సోనేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్‌షెడ్‌పూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల శాంతీ దేవికి, గోపాల్‌గంజ్ నగరంలోని మిర్జ్‌గంజ్‌కు చెందిన ముకేష్ కుమార్ సింగ్ అనే 30 ఏళ్ల వ్యక్తికి శనివారం ఓ గుడిలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం ఆ దంపతులను ఇంటికి తీసుకెళ్లారు. 
 
రాత్రి భోజన కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అయితే ఏమైందో ఏమో కానీ సోమవారం తెల్లవారుజామున వారిని నిద్రలేపేందుకు వెళ్లిన బంధువులకు అపస్మారక స్థితిలో కనిపించారు.
 
పక్కనే చికెన్ కూర కలిపిన అన్నం కూడా ఉంది. దాంట్లోనే విషం కలుపుకుని ఇద్దరూ తిని ఉంటారని అంతా భావిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ పెళ్లే అయినా ఎందుకు ఇలా చేశారన్నది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. వాళ్లు కోలుకుంటేనే కానీ అసలేం జరిగిందన్నది తెలియదని బంధువులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments