Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి 500 మందికి మించరాదు... నిశ్చితార్థం 100 మంది అతిథులకే పరిమితం

సాధారణంగా పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. భారీ సంఖ్యలో అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే వేడుక. అలా జరిగే పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ ఓ యేడాది చెప్పకోవాలి. కానీ, ఇకపై అటువంటి హంగామా చేసే

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (15:13 IST)
సాధారణంగా పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. భారీ సంఖ్యలో అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే వేడుక. అలా జరిగే పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ ఓ యేడాది చెప్పకోవాలి. కానీ, ఇకపై అటువంటి హంగామా చేసే అవకాశం లేకుండా చేయాలని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంపై పరిమితి విధించింది. అమ్మాయి పెళ్లిచేసేవారు గరిష్టంగా 500 మందిని, అబ్బాయి పెళ్లి చేసేవారు 400 మందినే ఆహ్వానించాలని షరతు విధించింది. 
 
ఇక నిశ్చితార్థం వంటి చిన్నపాటి శుభకార్యాలను 100 మంది అతిథుల సమక్షంలో మాత్రమే జరుపుకోవాలని సూచించింది. అంతేకాదండోయ్... లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడంపై, బాణసంచా కాల్చడంపై, ఆహ్వాన పత్రికతో స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి అందించడంపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని వనరులు భారీ పెళ్లిళ్ల పేరిట దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments