Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్నామీ బాబా అనే సాధువే.. నేతాజీ సుభాష్‌ చంద్రబోసా?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (13:39 IST)
నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌.. 76 ఏండ్లు గడిచినా ఆయన మరణం ఇంకా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తైపీలో 1945లో ఇదే రోజున జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని చరిత్రకారులు నమ్ముతున్నారు. అయితే, దానికి సంబంధించిన అధికారిక పత్రాలేవీ అందుబాటులో లేవు. అయితే, అజ్ఞాతంలో గడిపారని మరికొందరు చరిత్రకారులు చెప్తుంటారు. ఇన్నేండ్లయినా ఆయన మరణం గురించి అనుమానాలు ఇంకా మన మదిలో కొనసాగుతూనే ఉన్నాయి.
 
 రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్‌ నుంచి మంచూరియాకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం కనుమరుగై పోయింది. దాంతో ఆయన ఆ ప్రమాదంలో చనిపోయారని భావిస్తున్నారు. అయితే, తాయ్‌హోక్‌ విమానాశ్రయం వద్ద జరిగిన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని ఐదు రోజుల తర్వాత టోక్యో రేడియో ఒక వార్తను ప్రసారం చేసింది. 
 
ఈ ప్రమాదంలో నేతాజీ శరీరం పూర్తిగా కాలి బూడిదైందని కూడా తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించారని భావిస్తున్న నేతాజీ చితాభస్మాన్ని ఈనాటికీ టోక్యోలోని రంకోజీ దేవాలయంలో భద్రపరిచారు. అయితే, 1945 లో తమ భూభాగంలో ఎలాంటి విమాన ప్రమాదం జరుగలేదని తైవాన్‌ ప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో స్పష్టం చేసింది.
 
76 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణం ఇవ్వాల్టికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయంపై విచారణ జరిపేందుకు ఇప్పటివరకు మూడు కమిషన్లు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. ఆయన ఎలా చనిపోయారో గుర్తించాలని అప్పట్లో నియమించిన జస్టిస్ ఎంకే ముఖర్జీ ఏక సభ్య కమిషన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 
 
సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, కానీ ఆయన ఎలా చనిపోయారో గుర్తించలేకపోతున్నామని ఈ కమిషన్ తేల్చింది. ఇలాఉండగా, 1960-87 మధ్యకాలంలో అయోధ్య సమీపంలోని ఫైజాబాద్‌లో నివసించిన గుమ్నామీ బాబా అనే సాధువే.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని చాలా మంది నమ్మడం విశేషం.

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments