Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ సిమ్ కార్డుల అడ్డుకట్టకు చర్యలు.. ఇకపై సిమ్ కావాలంటే ఆ పని చేయాల్సిందే...

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (13:52 IST)
దేశ వ్యాప్తంగా నకిలీ సిమ్ కార్డుల బెడద పెరిగిపోయింది. నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్టకు కేంద్రం దృష్టిసారించింది. ఇకపై బయోమెట్రిక్ పూర్తి చేస్తే కొత్త సిమ్ విధానాన్ని అమల్లోకి తీసుకునిరానుంది. ఈ విధానం రానున్న సెప్టెంబరు 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. 
 
సైబర్ నేరాల అడ్డుకట్టకు వేసేందుకు కఠిన చర్యలు చేపట్టేందుకు, కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. మరీ ముఖ్యంగా సిమ్ కార్డుల జారీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తుంది. యధేచ్చగా జారీ అవుతున్న సిమ్ కార్డులను ఉపయోగించుకుని నేరగాళ్ళు ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలీకమ్యూనికేషన్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలు సెప్టెంబరు నుంచి అమల్లోకి తీసుకుని రావాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ నిర్ణయించింది. 
 
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అడిగిన వెంటనే సిమ్ కార్డు జారీ ఉండదు. బయోమెట్రిక్ పూర్తి చేస్తేనే కొత్త సిమ్ కార్డు జారీ చేస్తారు. అలాగే, స్పెక్ట్రమ్ కేటాయింపులతో పాటు శాటిలైన కమ్యూనికేషన్‌కు సంబంధించి కూడా నిబంధనలు రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలన్నా స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం