Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా టూర్ ఓవర్.. ఇక మహారాష్ట్ర ప్రచారం స్టార్ట్స్!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (19:18 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగించుకున్నారు. అమెరికా టూర్ సక్సెస్ కావడంతో మహారాష్ట్ర ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ బరిలోకి దిగనున్నారు. 
 
శివసేనతో దోస్తీ చెడిన నేపథ్యంలో మోడీ మేనియాను వినియోగిస్తే కానీ, ఆ రాష్ట్రంలో పార్టీ గట్టెక్కే పరిస్థితి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారు. దీంతో, వీలయినంత మేర మోడీని వాడుకోవాలని ఆయన నిర్ణయించారు.
 
ఇక, భారత వాణిజ్య రాజధానిగా భాసిల్లుతున్న మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో మొత్తం 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెజార్టీ సీట్లు ఎవరికైతే దక్కుతాయో, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 
 
ప్రస్తుతం 2009లో జరిగిన ఎన్నికల్లో ముంబైలో 13 చోట్ల పోటీ చేసిన బీజేపీ ఐదింట విజయం సాధించింది. తాజాగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, మోడీ చేత ప్రచారం చేయించి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు శివసేన ఇతరత్రా పార్టీలు బీజేపీని ఓడించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments