Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్.. చెరువులో నుంచి 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం!!

వరుణ్
గురువారం, 25 జులై 2024 (16:56 IST)
జాతీయ స్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతుంది. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రశ్నపత్రం లీకైనట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌కు చెందిన నిందితుడు అవినాశ్ అలియాస్ బంటీకి చెందిన 16 మొబైల్ ఫోన్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పాట్నా సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత కేసు విచారణ నిమిత్తం ఈ నెల 30వ తేదీ వరకు న్యాయస్థానం కస్టడీకి తీసుకుంది. 
 
అంతకుముందు ప్రాథమిక విచారణ సందర్భంగా కేసు గురించి బంటీ కీలక విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. పేపర్‌ లీక్‌కు ఉపయోగించిన 16 ఫోన్లను నిందితుడు చెరువులో పడేయగా టవర్‌ సిగ్నల్స్‌ ద్వారా ట్రాక్‌ చేసి రికవరీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పేపర్‌ లీక్‌లో అరెస్టయిన శశి పాసవాన్‌తో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
 
ఈ యేడాది మే నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నీట్‌ ప్రశ్నపత్రాలు పొందేందుకు అభ్యర్థులు రూ.35 నుంచి 60 లక్షల వరకు చెల్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బీహార్‌లోని కొందరు అభ్యర్థులు రూ.35 నుంచి రూ.45 లక్షలు, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు రూ.55 నుంచి రూ.60 లక్షలు చెల్లించి పేపర్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. 
 
ప్రస్తుతం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. పేపర్‌ లీక్‌ ఎక్కడ మొదలైంది.. ఎంతమంది విద్యార్థులకు చేరిందన్న వివరాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొనింది. అదేసమయంలో వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం