Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ చంకలు గుద్దుకోనవసరం లేదు : ఉద్ధవ్ ఠాక్రే

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (15:40 IST)
వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. 
 
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ అదేదో తమ ఘనతగా భారతీయ జనతా పార్టీ చంకలు గుద్దుకోనవసరం లేదని అన్నారు. కేంద్రంపై పూర్తిస్థాయి విశ్వాసం కోర్టుకు ఉండి ఉంటే ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుచేసి స్థలాన్ని దానికి అప్పగించాలని ఎందుకు కోరుతుందని ప్రశ్నించారు.
 
రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని తాము ఎప్పుడో డిమాండ్ చేశామనీ, కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా నిర్మాణ బాధ్యతలను ప్రత్యేక ట్రస్టుకే అప్పగించిందని గుర్తు చేశారు. అందువల్ల తీర్పు తమ ఘనతగా బీజేపీ చెప్పుకోరాదన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments