Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీ తివారీ కుమారుడి హత్య కేసు: భార్యే హంతకురాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (17:11 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కేసుకు సంబంధించి రోహిత్‌ భార్య అపూర్వ శుక్లాను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు ఆమెను మూడురోజుల పాటు విచారించి, బుధవారం అరెస్టు చేశారు. 
 
వైవాహిక జీవితంలో తలెత్తిన గొడవల కారణంగానే ఆమె భర్త రోహిత్ తివారీని హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. భర్త తాగిన మైకంలో ఉండగా ఆమె ఈ దారుణానికి పాల్పడిందన్నారు. అయితే ఈ హత్య కేసులో ఆమె ఎవరి సాయం తీసుకోలేదన్నారు. రోహిత్ ఊపిరాడకపోవడం వల్లే మృతి చెందినట్లు వైద్య నివేదికలో వెల్లడైన సంగతి తెలిసిందే. 
 
దీంతో బయటి వ్యక్తులు ఎవరూ లోనికి ప్రవేశించినట్లు ఆనవాలు లభించకపోవడంతో ఇంట్లోని వారే ఈ హత్య వెనుక కుట్రదారులుగా భావించి, ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు రోహిత్ భార్య అపూర్వను ఆదివారం నాడు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో అపూర్వ పొంతనలేని సమాధానాలు చెప్పడం, ఘటన జరిగిన సమయంలో ఇంటిలో అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసుల అనుమానాలను మరింత బలపరిచాయి.
 
ఈనెల 16వ తేదీన రోహిత్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే శవపరీక్ష నివేదికలో రోహిత్‌ది సహజ మరణం కాదని తేలడంతో కేసును క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి ఉజ్వల స్పందిస్తూ.. రోహిత్, అపూర్వ దంపతుల మధ్య ఆది నుండే సఖ్యత కొరవడిందని, పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేధాలు ఉన్నాయని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments