Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్రాస్ మృతిరాలి పేరును వెల్లడించిన డిగ్గీ రాజా - స్వర భాస్కర్.. కేసు నమోదు

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (09:31 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ హత్యాచార మృతిరాలి పేరును వెల్లడించడంతో ఆయనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, హీరోయిన్ స్వర భాస్కర్‌పై కూడా కేసు నమోదైంది. ఈమె కూడా మృతిరాలి పేరును వెల్లడించడంతో కేసు నమోదైంది. 
 
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి, ఎవరూ అత్యాచార బాధితురాలి పేర్లను వెల్లడించకూడదు. అయితే, వీరిద్దరూ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించారు. గత నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాత్రాస్‌లో ఓ దళిత బాలికపై మొక్కజొన్న పొలాల్లో దారుణంగా ప్రవర్తించిన నిందితులు, ఆమె మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. 
 
ఇక, ఆమె పేరును, చిత్రాలను వెల్లడించిన వారిపై ఐపీసీ సెక్షన్ 228తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 72 కింద కేసు పెట్టినట్టు సదాబాద్ సర్కిల్ ఆఫీసర్ తెలిపారు. కాగా, పోలీసులు కేసు పెట్టిన వారిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, హీరోయిన్ స్వరా భాస్కర్ తదితరులు ఉండటం గమనార్హం. అలాగే, వీరికి జాతీయ మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments