Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మేము ఎవరి మాటను వినం... ప్రధానమంత్రి మోదీ

పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో కాంగ్రెస్ పార్టీపైన మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందనీ, పార్టీల కోసం కా

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (13:57 IST)
పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో కాంగ్రెస్ పార్టీపైన మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందనీ, పార్టీల కోసం కాదని అన్నారు. తాము స్వాతంత్ర్య సమరంలో పాల్గొనకపోయినా దేశం కోసమే జీవిస్తున్నామనీ, దేశకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు.
 
లోక్ సభ సమావేశాల్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందని చూస్తే.... కుటుంబ పాలన ఇచ్చిందని తెలుస్తుందన్నారు. బినామీ చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని మాత్రం నోటిఫై చేయకుండా మరుగున ఎందుకు పడవేసిందో సమాధానం చెప్పాలన్నారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని నోటిఫై చేశామన్నారు. 
 
దేశంలో అవినీతిపరులు, నల్లధనం వెనుకేసుకుంటున్నవారి దారులను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నామనీ, అందులో భాగంగానే పెద్ద నోట్ల రద్దును అమలు చేశామన్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలంగా వుండటమూ, దేశ ప్రజలు తమకు సహకరించడం వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. దేశాభివృద్ధిని వెనుకకు లాగే సలహాలను, మాటలను తాము పట్టించుకోబోమని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments