Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మేము ఎవరి మాటను వినం... ప్రధానమంత్రి మోదీ

పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో కాంగ్రెస్ పార్టీపైన మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందనీ, పార్టీల కోసం కా

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (13:57 IST)
పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో కాంగ్రెస్ పార్టీపైన మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందనీ, పార్టీల కోసం కాదని అన్నారు. తాము స్వాతంత్ర్య సమరంలో పాల్గొనకపోయినా దేశం కోసమే జీవిస్తున్నామనీ, దేశకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు.
 
లోక్ సభ సమావేశాల్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందని చూస్తే.... కుటుంబ పాలన ఇచ్చిందని తెలుస్తుందన్నారు. బినామీ చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని మాత్రం నోటిఫై చేయకుండా మరుగున ఎందుకు పడవేసిందో సమాధానం చెప్పాలన్నారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని నోటిఫై చేశామన్నారు. 
 
దేశంలో అవినీతిపరులు, నల్లధనం వెనుకేసుకుంటున్నవారి దారులను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నామనీ, అందులో భాగంగానే పెద్ద నోట్ల రద్దును అమలు చేశామన్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలంగా వుండటమూ, దేశ ప్రజలు తమకు సహకరించడం వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. దేశాభివృద్ధిని వెనుకకు లాగే సలహాలను, మాటలను తాము పట్టించుకోబోమని అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments